భారతదేశం, ఫిబ్రవరి 5 -- Chits Director Suicide: వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రముఖ చిట్‌ఫండ్‌ కంపెనీ ‍యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆయన రాసిన సూసైడ్​ లెటర్​ సోమవారం ఉదయం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని సుబేదారి ఎక్సైజ్​ కాలనీకి చెందిన నల్లా భాస్కర్​ రెడ్డి(35) కనుకదుర్గ చిట్​ ఫండ్స్​ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​ కం డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.

నిత్యం బయట తిరిగే బిజినెస్​ కావడంతో తరచూ ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన కుటుంబ సభ్యులకు చెప్పి రోజువారీలాగే బయటకు వెళ్లాడు. ఆలస్యమవుతున్నా భాస్కర్​ రెడ్డి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్​ చేయగా.. వ్యక్తిగత పని ...