భారతదేశం, ఫిబ్రవరి 9 -- Chiranjeevi OTT Web Series: ప్రస్తుతం ఓటీటీల హవా ఎలా నడుస్తుందో తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ సమయం నుంచి ఓటీటీ వేదికల వాడకం ఎక్కువైంది. డిఫరెంట్ జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు, సరికొత్త కంటెంట్‌తో ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆకర్షించాయి. దాంతో భాషా బేధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి ఇతర భాషా చిత్రాలను వీక్షించారు మూవీ లవర్స్, ఆడియెన్స్. ఈ మధ్య కాలంలో వీటి హవా పెరగడంతో స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్‌గా పాపులర్ అయిన సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార తదితరులు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీసుతో ఓటీటీ డెబ్యూ చేశాడు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ డెబ్యూ ఇవ్వనున్నారని ఓ టాక్ జోరుగా నడుస్తోంది. లాక్ డౌన్ ...