భారతదేశం, మార్చి 31 -- Chhattisgarh Encounter : ఛత్తీస్ గడ్ జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు ముఖ్య నాయకురాలు మృతి చెందారు. సోమవారం ఉదయం దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు మరణించారు. మృతురాలు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు నాయకురాలు చైతు ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామం, ఆమె 35 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు.

ఎల్ఎల్బీ చదివిన చైతు తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అలాగే మహిళా సంఘంలో పనిచేశారు. సీఎం చంద్రబాబు అలిపిరి దాడి అనంతరం రేణుక అలియాస్ చైతు మావోయిస్టు పార్టీలోకి పూర్తిస్థాయి కార్యకర్తగా మారాయి. రేణుక అలియాస్ చైతు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఎర్రం రెడ్డి సంతో...