భారతదేశం, ఫిబ్రవరి 7 -- Chandrababu Delhi Tour : టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. బుధవారం రాత్రి లేదా రేపు అమిత్‌ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం వరకు హెలికాఫ్టర్ లో వెళ్లిన చంద్రబాబు, ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రికి దిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు. చంద్రబాబు పర్యటనలో బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 2014 ఎన్నికల తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయంటున్నారు. దిల్లీకి బయలుదేరే ముందు చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. దిల్లీ నుంచి పిలుపు వచ్చిందని పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు తెలిపారు. అయితే అక్కడికి వెళ్లాకే ఎందుకు పిలిచారో తెలుస్తుందని ...