భారతదేశం, నవంబర్ 29 -- వివేకా హత్య కేసుపై టీడీపీ(TDP) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయ్ హత్య కేసు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా.. పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిందని చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. విచారణను తెలంగాణ(Telangana)కు బదిలీ చేయడంతో సీఎం జగన్ తలెక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏ మాత్రం నైతికత ఉన్నా.. సీఎం జగన్(CM Jagan) వెంటనే రాజీనామా చేయాలన్నారు.

బాబాయ్‌ని హత్య చేసింది అబ్బాయేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి వెళ్లిందని, అబ్బాయ్ కూడా చంచల్ గూడ జైలుకి వెళ్తాడని ట్వీట్ చేశారు.

వివేకా హత్య కేసు(Viveka Murder Case) విచారణ ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రభుత్వ ప్రతిష్ఠ, పోలీస్ శాఖ...