భారతదేశం, మార్చి 19 -- CBN Meets Billgates: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో కీలక ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో బుధవారం భేటీ అయ్యారు.

ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో విస్తృత స్థాయిలో ప్రయోజనాలు అందించే విధానాలను అభివృద్ధి చేసే అంశాలపై ఈ ఒప్పందం జరిగింది.

గేట్స్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాల్లో కొత్త ఆవిష్కరణలను అందించడానికి సంయుక్తంగా పనిచేయనున్నారు. ఆరోగ్య రంగంలో AI ఆధారిత టెక్నాలజీ ద్వారా ప్రిడిక్టివ్ అనలిటి...