భారతదేశం, మార్చి 6 -- CBN In Delhi:రాష్ట్రంలోని పది కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి వివరించారు. . భూ వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ, నియంత్రణ లేకపోవడం వల్ల పెద్దఎత్తున ఆక్రమణలు జరిగాయని, ప్రైవేట్ భూములను కూడా 22ఏ కింద చేర్చారని వివరించారు.

బుధవారం ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో సమావేశమై పలు అంశాలను వివరించారు.

అమిత్ షాతో జరిగిన భేటీలో రాష్ట్రంలో గంజాయి రవాణాపై చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. గంజాయి సాగును సమర్థవంతంగా...