భారతదేశం, మార్చి 28 -- ఐ యాం ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్.. అలాగే తెలుగు వాడిగా గర్వపడుతున్నా.. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందని.. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని ఆశాభావం వ్యక్తం చేశారు. మద్రాస్ ఐఐటీలో దాదాపు 25 నుంచి 30 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారన్న చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయని వివరించారు.

'ఎక్కడికెళ్లినా మన తెలుగు వారే ఉన్నారు. ఏ దేశం వెళ్లినా మన వాళ్లే ఉన్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడా.. 2025లో ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు క్వాంటం వ్యాలీ డెవలప్ చేస్తున్నాం. 1999లో పవర్ సెక్టార్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రీన్ హైడ్రోజెన్ రంగంలో ఇప్పటికే అనేక ...