భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను.. పదేళ్ల పాలనతో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని.. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను.. ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేశారని ఫైర్ అయ్యారు కేటీఆర్.

'ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారు. పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్ రైతులలో ఆత్మవిశ్వాసం నింపారు. వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారు. ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతు భరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' అని కేటీఆర్ విమర్శించారు.

'ఇది ప్రజాప...