భారతదేశం, మార్చి 27 -- BRS Silver Jubilee: బీఆర్ఎస్ ప్లీనరీ, సిల్వర్ జూబ్లీ వేడుకలకు సరైన వేదిక కోసం ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, భట్టుపల్లి ప్రాంతాలను ఆ పార్టీ నాయకులు పరిశీలించగా.. రెండ్రోజుల కిందట మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ పేరు తెరమీదకు వచ్చింది.

రాష్ట్ర రాజధాని, హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఉండటం, బహిరంగ సభ కోసం జన సమీకరణకు వీలుంటుందనే ఉద్దేశంతో ఘట్ కేసర్ ఫిక్స్ అయినట్టేనని అంతా భావిస్తుండగా.. తాజాగా ఆ లొకేషన్ మరో చోటుకు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. పై మూడు ప్రాంతాలను కాదని, గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు బహిరంగ సభ నిర్వహణకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిని సెలెక్ట్ చేసినట్లు చర్చ జరుగుతోంది.

ఈ మేరకు బుధవారం బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ బాబు, దాస్యం వినయ...