భారతదేశం, ఫిబ్రవరి 7 -- దీపికా రంగ‌రాజు అలియాస్ బ్ర‌హ్మ‌ముడి కావ్య కొత్త అవ‌తారంలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. డ్యాన్స్ షోకు మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ది. ఈ షోతోనే బ్ర‌హ్మ‌ముడి కావ్య ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ మొద‌లుకాబోతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఈ డ్యాన్స్ రియాలిటీ షో స్ట్రీమింగ్ కాబోతుంది. డ్యాన్స్ ఐకాన్ సీజ‌న్ కు ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోండ‌గా... హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ జ‌డ్జ్‌లుగా క‌నిపించ‌బోతున్నారు.

ఈ డ్యాన్స్ షోకు మ‌రో నలుగురు మెంటార్స్ కూడా ఉండ‌నున్నారు. వీరిలో దీపిక రంగ‌రాజు ఒక‌రు. ఆమెతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్ కూడా మెంట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ వెల్ల‌డించింది. వై...