భారతదేశం, ఫిబ్రవరి 8 -- టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్రహ్మానందం, ఆయ‌న‌ రాజా గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బ్ర‌హ్మా ఆనందం మూవీ ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ తో పాటు వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. . ఈ కామెడీ డ్రామా మూవీతో ఆర్‌వీఎస్ నిఖిల్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో తొలుత హీరోగా వెన్నెల‌కిషోర్‌ను అనుకున్న‌ట్లుగా నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా తెలిపారు. బ్ర‌హ్మా ఆనందం సినిమా గురించి రాహుల్ యాద‌వ్ న‌క్కా ఏం అన్నారంటే?

బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే ఈ సినిమా చేయాల‌ని అనుకున్నాం. కానీ ఆ టైటిల్ మాకు దొరకలేదు. బ్రహ్మా ఆనందంగా మార్చాం. తాత, మనవళ్ల కథ ఇది. ఇందులో తాత తాను చేసిన తప్పుల్ని రియలైజ్ అవుతాడు. మనవడు కూడా తన తప్పుల్ని తెలుసుకుంటాడు. ఓ అందమైన కథన...