భారతదేశం, మార్చి 18 -- BITS and Deeptech: అమరవాతి బిట్స్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ అమోదం తెలిపింది. రాష్ట్రానికి పెద్దఎత్తున ప్రైవేటు, విదేశీ వర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని 75 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని నిర్ణయించి , దేశంలో పేరెన్నికగన్న బిట్స్ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి 75ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని లోకేష్‌ వివరించారు.

టాటా గ్రూప్, ఎల్ అండ్ టి, ఐఐటి మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనిని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీస...