భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఫామ్‌లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు నిర్ధారించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్‌లోనూ.. 500 కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి, దీంతో 52 వేల కోళ్లు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ కారణంగా నష్టాల్లో కూరుకుపోతున్నామని.. కోళ్ల ఫారం యజమానులు, మాంసం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. దీంతో అధికారులు అలర్ట్ అయి.. నివారణ చర్యలు చేపట్టారు. రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వచ్చే ఒక ఇన్...