Hyderabad, ఏప్రిల్ 29 -- Biggest Flop Movie: ఒకే ఒక్క సినిమాకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందంటే నమ్మగలరా? అది కూడా ఓ తెలుగు సినిమా కావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఆ మూవీ పేరు రాధేశ్యామ్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఆ మూవీ ఇచ్చిన షాక్ నుంచి ప్రభాస్ ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. ఇక ఇందులో ఫిమేల్ లీడ్ గా నటించిన పూజా హెగ్డే కూడా ఐరన్ లెగ్ పేరు తెచ్చుకొని టాలీవుడ్ నుంచి వెళ్లిపోయింది.

బాహుబలి, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అందుకే వీటి తర్వాత అతడు నటించిన ప్రతి సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. బాహుబలి 2 తర్వాత మొదట సాహో రిలీజైంది. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి భారీ నష్టాలనే మిగిల్చింది. అయితే రాధేశ్యామ్ మాత్ర...