భారతదేశం, ఫిబ్రవరి 2 -- భారీ ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ రిటైల్ విక్రయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ భారత్ రైస్ వచ్చే వారం నుంచి కిలో రూ.29 లకే లభిస్తాయి. ధరలను నియంత్రించడానికి అక్రమంగా, భారీగా బియ్యాన్ని నిల్వ చేయకూడదని ప్రభుత్వం వ్యాపారులను ఆదేశించింది.

''వివిధ రకాలపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను నియంత్రించడానికి, సబ్సిడీలో 'భారత్ రైస్' ను వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో కిలోకు 29 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.

నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫ...