భారతదేశం, మార్చి 20 -- Bettings Apps Case: బెట్టింగ్ యాప్స్‌ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆన్‌లైన్‌ వేదికలపై వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. బుధవారం మియాపూర్‌ పిఎస్‌ పరిధలో నమోదు చేసిన కేసులో 25మందిపై అభియోగాలు నమోదు చేశారు.

రెండ్రోజుల క్రితం బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు చేయగా తాజాగా మియాపూర్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 25మందిపై బిఎన్‌ఎస్‌ సెక్షన్లతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్‌, ఐటీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్...