భారతదేశం, ఫిబ్రవరి 7 -- వంటగదిలో అనేక ఔషధ గుణాలు ఉన్నవి దొరుకుతాయి. వంటలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో బే ఆకులు అదే బిర్యానీ ఆకులు ఒకటి. చాలా మంది బే ఆకులను రుచి కోసమే కలుపుతారని అనుకుంటారు. కానీ బిర్యానీ ఆకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును వంటలో చేర్చుకోవడమే కాకుండా, నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఆకులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 మాత్రమే కాకుండా, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

బిర్యానీ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బిర్యానీ ఆకును నీటిలో మరిగించి తాగినప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

తరచుగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటే బే ఆకులను నీటిలో మరిగించి తాగండి. ఆకులోని పోషకాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట...