భారతదేశం, నవంబర్ 27 -- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిర్మల్(Nirmal) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తాటిపల్లి వద్ద అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు(Police), బండి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ముందుగా పాదయాత్ర(Padayatra)కు అనుమతిచ్చి.. చివరి నిమిషంలో ఎందుకు నిరాకరించారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర భైంసాలో మెుదలుకావాల్సి ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించారు. అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. అక్కడ నుంచి కోరుట్ల వైపు వెళ్లారు.

ఓ వైపు సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ(BJP) శ్రేణులు ధర్నాకు దిగాయి. వారిని అదుపులోకి తీసుకున్నారు...