తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 21 -- లే అవుట్ క్రమబద్దీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.50 వేల కోట్ల దండుకునేందుకు స్కెచ్ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క మాట్లాడిన వీడియో క్లిపింగ్స్ ను మీడియాకు విడుదల చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ పెద్దపల్లి లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్లు దండుకునేందుకు సిద్ధమైందన్నారు...