భారతదేశం, మార్చి 24 -- Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ కుటుంబం దొంగ నోట్లు ముద్రించి ఉద్యమంలో ఎన్నికల్లో పంచిందని ఆరోపించారు. దొంగ నోట్లతో కోటీశ్వరులయ్యారని విమర్శించారు. కరీంనగర్ లోని శుభం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఆత్మీయ సన్మానానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని ఆరోపించారు. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడిందని, ఆప్, బీఆర్...