భారతదేశం, మార్చి 4 -- Bandi Sanjay: కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమరయ్యను గెలిపించి ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల నమ్మకంతోనే ఈ తీర్పు వెలువడిందన్నారు. ఈ తీర్పు టీచర్లకు, మోదీకే అంకితమన్నారు.

కరీంనగర్ - నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించి గెలుపు పత్రాన్ని అందుకున్న మల్క కొమరయ్యను అభినందించేందుకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మల్క కొమరయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప...