Hyderabad, మార్చి 14 -- శిశువులకు పెట్టే ఆహారంపై తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఎంతో అవసరం. ముఖ్యంగా వారికి ఏడాదిలోపు వయసు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. తల్లిపాలు పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు దంతాలు రావడం ప్రారంభమయ్యాక కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వడం ప్రారంభిస్తారు.

ఆరు నెలల వయసు దాటాక కొన్ని రకాల ఆహారాలను శిశువుకు తినిపించడం మంచి పద్ధతి కాదు. ఏడాదిలోపు పెట్టకూడని ఆహారాల గురించి ఇక్కడ మేము ఇచ్చాము. వాటిని గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి.

తేనె పిల్లలకు ఎంతో మంచిది. అయితే ఏడాదిలోపు పిల్లలకు మాత్రం దీన్ని తినిపించకూడదు. అది ఏమాత్రం సురక్షితం కాదు. తేనెలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పిల్లల జీర్ణవ్యవస్థలో సమ...