Hyderabad, జనవరి 11 -- శీతాకాలంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం వల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు దురద వంటి అనేక రకాల వ్యాధులు శీతాకాలంలో వచ్చే సాధారణ వ్యాధులు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఏ వ్యాధి అయినా త్వరగా దాడి చేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మారుతున్న రుతువులకు అనుగుణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు ఆయుర్వేదం ఉత్తమ మార్గం.

హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ హెర్బల్, ఆయుర్వేద ప్రొడక్షన్ హెడ్ డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా తినాల్సిన ఆహర పదార్థాల గురించి వివరంగా తెలిపారు. ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, చలికాలంలో ఎలాంటి జబ్బు దరిచేరకుండా ఉంటుం...