భారతదేశం, మార్చి 31 -- Avanigadda Accident : కృష్ణా జిల్లా అవనిగడ్డ పులిగడ్డ - పెనుమూడి వారధి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న తెనాలికి చెందిన ముగ్గురు వ్యక్తులు గిడుగు రవి మోహన్ బాబు, అతని భార్య అరుణ, మనవడు షణ్ముఖ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.

తీవ్ర గాయాల పాలైన పల్లవి, సాత్విక, సందీప్ లను మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక మృతి చెందింది. చనిపోయిన వారిలో మూడు నెలల పసిబాలుడు ఉన్నాడు. తెనాలి నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తుంతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస...