భారతదేశం, ఏప్రిల్ 30 -- AU MBA Admissions : విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University)లో వచ్చే విద్యాసంవత్సరానికి(2024-25) లాజిస్టిక్స్ ఎంబీఏ (MBA Admissions)ప్రోగ్రామ్స్(Self Supported)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆంధ్ర యూనివర్సిటీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ తో కలిసి ఈ కోర్సులను ఆన్ లైన్ ద్వారా అందిస్తోంది. లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనెజ్మెంట్ లో రెండేళ్ల ఎంబీఏ డిగ్రీ ప్రోగ్రామ్ ను ఏయూ అందిస్తోంది. ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ఎంబీఏ కోర్సుకు అర్హులు. భద్రతా దళాలలో పనిచేస్తున్న వారికి, డిపెండెండ్స్‌, వార్డ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ కోర్సుకు డిఫెన్స్ పర్సనల్స్, డిపెండెంట్లు రూ.40 వేలు, ఇతరులకు రూ.60 వేలు కోర్సు ఫీజుగ...