భారతదేశం, మార్చి 28 -- పుణ్య‌క్షేత్రాలు అరుణాచ‌లం, రామేశ్వ‌రం వెళ్లే భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. అరుణాచ‌లం, రామేశ్వ‌రం, తిరువ‌నంత‌పురం, మ‌ధురై, ఊటీతో పాటు 14 క్షేత్రాలు, ప‌ర్య‌ాట‌క ప్రాంతాలకు స్పెష‌ల్ స‌ర్వీసును వేసింది. రాష్ట్రంలోని రాజ‌మండ్రి నుంచి త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై), రామేశ్వ‌రానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది.

అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై), రామేశ్వ‌రం యాత్ర పేరుతో యాత్రికుల కోసం ప్ర‌త్యేక స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది రోజుల పాటు 14 క్షేత్రాల‌ను ద‌ర్శించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. ఏప్రిల్ 23న సాయంత్రం 4 గంట‌ల‌కు బ‌స్సు రాజ‌మండ్రి డిపో నుంచి బ‌య‌లుదేరుతుంది. ఆర్టీసీ సూప‌ర్ ...