భారతదేశం, ఏప్రిల్ 7 -- Apollo Health Report : అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా నిర్వహించిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా 'హెల్త్‌ ఆఫ్‌ ద నేషన్‌ 2025'(HON 2025) నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా 'ఆరోగ్యా్న్ని మీ ప్రాధాన్యతగా మలుచుకోండి' అనే స్పష్టమైన సందేశం ఇచ్చింది. అపోలో నివేదిక ప్రకారం చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిని కలిగి ఉంటున్నారని పేర్కొంది. ఎలాంటి లక్షణాలు లేకున్నప్పటికీ 26 % మంది హైపర్‌టెన్షన్‌ కలిగి ఉంటే, 23% మంది మధుమేహం కలిగి ఉన్నారని గుర్తించింది.

ఒకప్పుడు మద్యం తాగే వారికి మాత్రమే వచ్చే ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఊబకాయం, మధుమేహం, రక్తపోటుతో ముడిపడిన ఆరోగ్య సమస్యగా మారింది. 257,199 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా... ఆశ్చర్యకరంగా 65% మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నట్లు...