భారతదేశం, జనవరి 10 -- ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APMSRB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 97 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

సూపర్‌ స్పెషాలిటీల్లో క్లినికల్, నాన్‌-క్లినికల్‌ విభాగాల్లో ఈ పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....