భారతదేశం, మార్చి 26 -- APDC Vigilance Report: వైసీపీ ప్రభుత్వ హయంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది. నాటి వీసీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు అక్రమాలకు బాధ్యులైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి నష్టం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలతో పాటు క్రమశిక్షణ చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది.

ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌లో లేని ఉద్యోగులకు జీతాల చెల్లింపు మొదలుకుని ప్రతి వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్‌ గుర్తించింది. ఫలితంగా నాలుగేళ్లలో దాదాపు రూ.171 కోట్ల రుపాయల దుర్వినియోగం అయ్యాయని వాటిలో రూ.139 కోట్ల రుపాయలు ఇప్పటికే చెల్లింపులు జరిపినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ, ఏసీబీతో దర్యాప్తు జరపాలని విజిలెన్స్‌ నివేదిక పేర్కొంది.

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లో కోట్లాది రుపాయల దుర...