భారతదేశం, ఏప్రిల్ 14 -- Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గత వారం సింగపూర్‌లోని టమాటో కిచెన్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ అరకు పర్యటనలో ఉన్నారు. చికిత్స తర్వాత శనివారం రాత్రి సింగపూర్‌ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో కుమారుడు సురక్షితంగా ఉండటంతో పవన్ సతీమణి మొక్కుల...