భారతదేశం, ఏప్రిల్ 3 -- Amaravati Works: ఏపీ రాజధాని అమరావతి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవడంతో నిధుల సమీకరణ ఇప్పటికే కొలిక్కి వచ్చింది. ఏప్రిల్‌ మూడో వారం లోపు రాజధాని నిర్మాణ పనుల్ని ప్రధానమంత్రి చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటనపై సిఎస్ విజయానంద్ సమీక్షించారు.

రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన,ప్రారంభోత్సవాలకు ఈనెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతికి రానున్న నేపధ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రాధమిక సమీక్ష నిర్వహించారు.

అమరావతిలో ప్రధాని పర్యటన ఖరారు కావాల్సి ఉంది. ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి ...