Amaravati,andhrapradesh, మే 2 -- మరికొద్ది నిమిషాల్లో సభా వేదిక వద్దకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వేదికపైకి చేరుకుంటారు.

అమరావతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. కాసేపట్లో ప్రధానమంత్రి మోదీ సభ వద్దకు చేరుకుంటారు.

2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌ కలిగిన 'క్వాంటం సిస్టం 2'ని అమరావతిలో నెలకొల్పనుంది.

ప్రధాని మోదీ గన్న...