Amaravati,andhrapradesh, మే 2 -- అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమరావతి రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చామని.. అందుకు అనుగుణంగా పని చేస్తామన్నారు.

3 రాజధానులు అంటూ గత ప్రభుత్వం అమరావతిని చంపే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. రైతులు పోరాటం చేస్తే అనేక కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. వందలాది రోజులుగా అమరావతి రైతుల పోరాటం కొనసాగిందని గుర్తు చేశారు. ఎవరో ఆపితే ఆగేది అమరావతి కాదని చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు జరుగుతున్న నేపథ్యంలో. ఇక అమరావతి ఆగేదే ఉండదని చెప్పారు.

సభను ఉద్దేశించి మంత్రి లోకేశ్ ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్...