Amaravati,andhrapradesh, మే 2 -- 'మరో మూడేళ్లలో అమరావతి పునః ప్రారంభ నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. ఆ రోజు కూడా ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం. కేంద్రం సాకారంతో పనులు వేగవంతం చేస్తాం' అని సీఎం చంద్రబాబు చెప్పారు.

"అమరావతి ఉద్యమకారులకు సెల్యూట్ చేస్తున్నాను. నా జీవితంలో ఇలాంటి ఉద్యమం చూడబోను. కేసులు పెట్టి వేధించినా రైతులు వెనకడుగు వేయలేదు. లక్ష్యం సాధించే వరకు ముందుకే వెళ్లారు" అని సీఎం చంద్రబాబు కొనియాడారు.

ఈరోజు చరిత్రలో లిఖించిదగ్గ రోజు. పదేళ్ల క్రితం మోదీ చేతుల మీదుగానే అమరావతికి శంకుస్థాపన జరిగింది. దేశానికి ప్రధానిగా మోదీ ఉండటం గర్వకారణం. ఇండియా.. న్యూ ఇండియాగా మారుతోంది. మోదీ సారథ్యంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా మారబోతుంది.

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమరావతి రైతులు ఇబ్బందులు...