Amaravati,andhrapradesh, మే 2 -- ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణమంతా ఎస్పీజీ ఆధీనంలో ఉండనుంది. ఇప్పటికే ఆయా బలగాలు మోహరించాయి. ఇక మోదీ పాల్గొనే సభపైకి కూడా అతి తక్కువ మందికే అవకాశం ఉంది. మొత్తంగా 14 మందికి మాత్రమే చోటు కల్పించనున్నారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు, కూటమి నేతలకు అవకాశం ఉండనుంది.

సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తంగా సాయంత్రం 5 గంటలలోపే ప్రధానమంత్రి మోదీ ఏపీ టూర్ ముగుస్తుంది.

మధ్యాహ్నం 3.30 నుంచి 4.45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో ప...