భారతదేశం, జనవరి 22 -- Amaravati Capital : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబయిలో జరిగిన సమావేశంలో అమరావతికి రూ.11 వేల కోట్ల నిధులు విడుదలకు హడ్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామన్నారు. ఈ నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి తెలపడంతో అమరావతి పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....