ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, మార్చి 22 -- ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ (ఏఐబీఈ 19)కు సంబంధించిన ఫలితాలు వచ్చేశాయ్...! శుక్రవారం సాయంత్రం తర్వ ఈ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు ఏఐబీఈ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షను గతేడాది డిసెంబర్ 22వ తేదీన నిర్వహించారు. ఆ వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఆ తర్వాత మార్చి 6వ తేదీన ఫైనల్ కీని ప్రకటించారు. తాజాగా తుది ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు.

వంద మార్కు...