తెలంగాణ,హైదరాబాద్, మార్చి 6 -- ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ (ఏఐబీఈ 19)కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. గతేడాదిలో డిసెంబర్ 22వ తేదీన పరీక్ష జరగగా. ఆ వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. అయితే తాజాగా ఫైనల్ కీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏఐబీఈ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ గా ఉంది. ఏపీలో తిరుపతి, విజయవాడ, విశా...