భారతదేశం, ఏప్రిల్ 18 -- Aadi Sai Kumar: దాదాపు ఏడాది గ్యాప్ త‌ర్వాత త‌న కొత్త మూవీని అనౌన్స్‌చేశాడు ఆదిసాయికుమార్‌. విలేజ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గురువారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో నిర్మాత దిల్‌రాజుతో పాటు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీకి వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో ఆదిసాయికుమార్‌, వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి కాంబోలో చుట్టాల‌బ్బాయి సినిమా వ‌చ్చింది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ, లవ్, కామెడీ అంశాల‌తో ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీ రాబోతోంది. ఈ సినిమాలో ఆదికి జోడీగా దిగంగ‌నా సూర్య‌వ‌న్షీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క్రేజీ ఫెలో త‌ర్వాత ఆదిసాయికుమార్‌, దిగంగ‌న...