భారతదేశం, జూలై 10 -- ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఇప్పటికే 585 పరుగులు చేశాడు. వాటిలో 430 పరుగులు ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో వచ్చాయి. ఈ టెస్టులో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసిన గిల్, ఎడ్జ్‌బాస్టన్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు లెజెండరీ డాన్ బ్రాడ్‌మన్ రికార్డులపై కన్నేశాడు.

ఇంగ్లాండ్ తో సిరీస్ లో లెజెండరీ డాన్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన కనీసం నాలుగు ప్రపంచ రికార్డులను శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డులు 95 ఏళ్లుగా కొనసాగుతున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....