భారతదేశం, మే 9 -- గురువారం సాయంత్రం జమ్మూలో వరుస పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్తాన్‌లోని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసిన ఒక రోజు తర్వాత ఈ పేలుడు సంభవించింది.

సత్వారి, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా ప్రాంతాలపై పాకిస్తాన్ గురువారం రాత్రి ప్రయోగించిన 8 మిస్సైళ్లను భారత సైన్యం అడ్డుకుందని రక్షణ వర్గాలు తెలిపాయి.

ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారిక X ఖాతా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

'జమ్మూ & కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ మిలిటరీ స్టేషన్లను పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి లక్ష్యంగా చేసుకుంది. ఎలాంటి నష్టం జరగలేదు" అని పోస్ట్ చేసింది.

'భారత సాయుధ దళాలు తమ విధి విధానాల ప్రకారం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి" అని పేర...