భారతదేశం, జూన్ 3 -- బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, విస్తరించిన వాల్యుయేషన్లు, విదేశీ మూలధన ప్రవాహంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య భారత స్టాక్ మార్కెట్ జూన్ 3 మంగళవారం గణనీయమైన నష్టాలను చవిచూసింది.

సెన్సెక్స్ 81,373.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో దాదాపు 800 పాయింట్లు లేదా 1 శాతం క్షీణించి 80,575.09 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తరువాత కొంత తేరుకుని 636 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో 80,737.51 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 24,786.30 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో దాదాపు 1 శాతం క్షీణించి, అనంతరం కొంత తేరుకుని చివరకు 24,542.15 వద్ద ముగిసింది. బీఎస్ ఈ మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.52 శాతం, 0.07 శాతం నష్టపోయాయి.

బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.445.50 లక్షల కోట్ల నుంచి ఒక్క సెషన్ లో దాదాపు రూ.443 లక్ష...