భారతదేశం, మే 9 -- రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో న‌టించిన మూవీ '6 జర్నీ'. ఈ సినిమాకు బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మే 9న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే?

హైదరాబాద్ సిటీలో వేర్వేరు చోట్ల మర్డర్స్ జరుగుతాయి. ఓ కొత్త నంబ‌ర్ నుంచి వ‌చ్చిన ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేసిన కొంతమంది చెవిలో నుంచి రక్తం కారి మరణిస్తారు. మరోవైపు సెల్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ కిడ్నాప్ అవుతారు. సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి.

ఇదే టైమ్‌లో తరుణంలో ఆరుగురు స్నేహితులు (రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి & కో) గోవా ప్రయాణం అవుతారు. జర్నీలో ఓ అప‌రిచిత వ్య‌క్తికి వారు లిఫ్ట్ ఇస్తారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన హ‌త్య‌ల‌కు తాము...