Telangana,hyderabad, జూన్ 11 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఉదయమే ఫామ్ హౌస్ నుంచి బయల్దేరిన కేసీఆర్ . హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. దాదాపు 50 నిమిషాలకు పైగా కేసీఆర్ విచారణ కొనసాగింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం వంటి పలు అంశాలను కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్ల ద్వారా పీసీ ఘోష్ కమీషన్ కు వివరాలను చెప్పినట్లు సమాచారం.

Published by HT Digital Content Services with permission from HT Telugu....