భారతదేశం, మే 3 -- పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌తో పాకిస్థాన్‌కు ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ ప్రస్తుతం భారతదేశం నుండి దాడి భయంతో ఉంది. ఇప్పటికే వైమానిక దళాన్ని అప్రమత్తం చేసి, సరిహద్దు దగ్గర తన సైనిక మోహరింపును పెంచింది. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ నిరంతరం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అయితే తాజాగా మరో కవ్వింపు చర్యలకు పాల్పడింది పాక్. బాలిస్టిక్ క్షిపణిని విజయవతంగా పరీక్షించినట్టుగా ప్రకటించింది.

పాకిస్థాన్ శనివారం 450 కిలో మీటర్ల పరిధి కలిగిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంది. అబ్దాలి వెపన్ సిస్టమ్ అని ఈ క్షిపణిని పిలుస్తారు. 'ఈ ప్రయోగం దళాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ, కీలకమైన సాంకేతిక పారామితులను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది...