భారతదేశం, ఫిబ్రవరి 14 -- బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఎట్టకేలకు 'ది లేడీ కిల్లర్' సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలపై స్పందించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచిన ది లేడీ కిల్లర్ సినిమా వైఫల్యం తనను మానసికంగా ఎంతో కృంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తాను ఒప్పుకున్న కథకు, థియేటర్లలో విడుదలైన సినిమాకు అస్సలు సంబంధం లేదని భూమి పెడ్నేకర్ కుండబద్దలు కొట్టారు.

మిడ్-డేతో (Mid-Day) జరిపిన తాజా సంభాషణలో భూమి పెడ్నేకర్ ది లేడీ కిల్లర్ మూవీ సమయంలో జరిగిన దారుణాలను బయటపెట్టారు. "మేము చదివిన స్క్రిప్ట్ పూర్తయింది. కానీ, షూటింగ్ విషయానికి వస్తే 35 శాతం సినిమాను అసలు చిత్రీకరించనే లేదు. విడుదలైన వెర్షన్ ఒక అసంపూర్ణ చిత్రం (Incomplete film). నా కెరీర్‌లోనే ఇది అత్యంత బాధాకరమైన దశ. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక...