భారతదేశం, సెప్టెంబర్ 11 -- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై మరో అడుగు ముందుకు పడింది. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదముద్ర పడిన. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణకు రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు అనుమతి లభించింది.

రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో. త్వరలోనే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....