భారతదేశం, జనవరి 5 -- మరాఠీ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, రన్నరప్ జై దుధానే చిక్కుల్లో పడ్డారు. ఒక రియల్ ఎస్టేట్ స్కామ్‌కు సంబంధించి థానే పోలీసులు ఆయనను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్‌కు విదేశాలకు వెళ్తున్న తరుణంలో ఈ అరెస్ట్ జరగడం సంచలనం సృష్టించింది.

తన అరెస్టుపై జై దుధానే స్పందిస్తూ.. "నేను నా భార్య, సోదరుడు, వదినతో కలిసి హనీమూన్ కోసం విదేశాలకు వెళ్తున్నాను. నాపై లుకౌట్ నోటీసులు ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు. పోలీసులు నన్ను అడ్డుకుని, దేశం విడిచి వెళ్లకూడదని చెప్పారు. నేను వారికి పూర్తిగా సహకరిస్తున్నాను" అని తెలిపారు.

పోలీసు వ్యానులో కూర్చుని మీడియాతో మాట్లాడిన జై దుధానే.. ముఖానికి మాస్క్ వేసుకోవడానికి కూడా నిరాకరించారు. "నేను తప్పు చేయలేదు, అలాంటప్పుడు భయపడి ...