Hyderabad, జూన్ 8 -- తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్‌లో​ జీ తెలుగు ఒకటి. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు 'ప్రేమతో.. జీ తెలుగు'తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది.

'ప్రేమతో.. జీ తెలుగు' క్యాంపెయిన్‌​లో భాగంగా జీ తెలుగు ఛానల్​ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. 'మమతతోనే మాట మధురం' అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు సంస్కృతి, సమాజం, సమిష్టి భావాల సంగమంగా ఉండనుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు వారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్‌ ఫిల్మ్‌లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగు వారి లోగిలిలో జరిగే పెళ్లి తంతును కళ్లకి కట్టినట్లు చూపించార...